Thursday, September 19, 2024

AP ట‌పాసులు కేంద్రంలో పేలుడు .. భార్య‌భ‌ర్త‌లు దుర్మ‌ర‌ణం..

చిత్తూరు – ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ ప్రమాద ఘటన మరువక ముందే.. మరో కంపెనీలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు.. తీవ్రగాయాలపాలైన కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది..

ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ భాషాతో పాటు ఆయన భార్య షాహినా ప్రాణాలు విడిచారు.. మరోవైపు.. బాణాసంచా అమ్మకాల లైసెన్స్ తో ఏకంగా బాణాసంచా తయారు కేంద్రం నడుపుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు.. ఇక, పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.. తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడికి కారణమా అనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement