Thursday, September 26, 2024

AP – ప‌వ‌న్ స‌మక్షంలో జ‌న‌సేన‌లో బాలినేని, సామినేని, కిలారి చేరిక‌

అమరావతి –వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారు రోశయ్య లు జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో నేటి సాయంత్రం జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. వారితో పాటు పారిశ్రామికవేత్త కంది ర‌వి శంక‌ర్ కూడా జ‌న‌సేన‌లో చేరారు. అంత‌కు ముందు భారీ సంఖ్య‌లో కార్య‌కర్త‌ల‌తో ఒంగోలు నుంచి ర్యాలీగా బ‌య‌ల‌దేరి మంగ‌ళ‌గిరికి చేరుకున్నారు బాలినేని.. అయ‌న‌తో ఆయ‌న కుమారుడు కూడా నేడు ప‌వ‌న్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement