Sunday, September 8, 2024

AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా.. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేయించారు.

రెండో రోజు అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీకి చెందిన అయ్యన్నపాత్రుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఏపీ సభాధ్యక్షులు గా ఎన్నికైన అయ్యన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కాగా రెండో రోజు సమావేశాలకు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement