Saturday, September 14, 2024

AP 175 assembly seats – లీడ్స్ – టీడీపీ 131, వైసిపి 17, జనసేన 20, బిజెపి 7 ,

ఎపిలోని మొత్తం 175 స్థానాల పోస్టల్ లెక్కింపు కొనసాగుతున్నది.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టిడిపి 131. వైసిపి 17 . జనసేన 20, బిజెపి 7 చోట్ల ఆధీక్యంలో ఉన్నాయి..

మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్, చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్,
తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు,
పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర,
విజయవాడ (సెంట్రల్)లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమ,
విజయవాడ (పశ్చిమ)లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. 
ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 2,760 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రాజమండ్రి అర్బన్ లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజలో ఉన్నారు.
 వైసీపీ నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు.
గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రాజమండ్రి రూరల్ లో రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2,870 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
మరో వైపు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు,
పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.

పిఠాపురం లో వెయ్యి ఓట్లతో పవన్ కళ్యాణ్ ముందంజ..
రాజమండ్రి రూరల్‌: 2,870 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్యచౌదరి..
మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు, ల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణకు లీడ్‌
కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు 1541 మెజార్టీ తో ఆదిక్యం
మచిలీపట్నం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కే రవీంద్ర మొదటి రౌండ్లో 14 68 ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు

ఈవీఎం మొదటి రౌండ్లో పాలకొల్లు తెలుగుదేశం అభ్యర్థి 8846, వైసిపి అభ్యర్థి గోపి 3305
నంద్యాల జిల్లా – డోన్లో టిడిపి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బుగ్గన పై 550 ఓట్ల ఆదిక్యత.
పెడన అసెంబ్లీ నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్ మొదటి రౌండ్లో 1,200 ఓట్ల ఆదిక్యం

- Advertisement -

తెనాలి లో నాదెండ్ల మనోహర్ లీడ్
బాపట్లలో కుటమి అభ్యర్థి నరేంద్ర వర్మ లీడ్ .బాపట్ల అసెంబ్లీ మొదటి రౌండ్లో టిడిపి అభ్యర్థి నరేంద్ర వర్మ కు 5907 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రఘుపతికి 4513

నరసరావుపేట లో చదలవాడ అరవింద్ బాబు 1800 ఓట్లు తో ముందంజ…
మొదటి రౌండ్లో మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటికి 1,802 ఓట్ల ఆధిక్యం
మొదటి రౌండ్లో మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటికి 1,802 ఓట్ల ఆధిక్యం
మొదటి రౌండ్లో గురజాల తెదేపా అభ్యర్థి యరపతినేనికి 1,311 ఓట్ల ఆధిక్యం
సత్తెనపల్లి టిడిపి అభ్యర్ధి కన్నా లక్ష్మి నారాయణ 860 ఓట్లు ఆధిక్యం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు మొదటి రౌండ్లో 1,086 ఓట్ల అధిక్యం.
వినుకొండ టీడీపీ అభ్యర్థి జీ వీ ఆంజనేయులు 611అధిక్యం
ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ 2,280 ఓట్ల అధిక్యం.. వెనుకబడ్డ స్పీకర్ తమ్మినేని

వెనుకబడిన మంత్రులు..
ఏపీలో ఎన్నికల ఫలితాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఆర్కే రోజా, చెల్లబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి, వెనుకంజలో కొనసాగుతున్నారు.

పలాస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష 4,388 ఓట్ల అధిక్యం.

అవనిగడ్డ నియోజకవర్గం జనసేన కూటమి అభ్యర్ధి మండలి బుద్ధ ప్రసాద్ మొదటి రౌండ్ లో 5629 ఓట్లు పొలవ్వగా, వైకాపా అభ్యర్ధి 3400 ఓట్లు. వైకాపా అభ్యర్థిపై 2229 ఆధిక్యంలో మండలి బుద్ధ ప్రసాద్ కొనసాగుతున్నారు.

ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ 2,300 ఓట్ల అధిక్యం..

రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 3 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 11,286 ఓట్లతో ముందంజ.

పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ అభ్యర్థి 5432 ఆధిక్యం.

కడప జిల్లా.. బద్వేలులో 3 రౌండ్లు ముగిసేసరికి 5794 ఓట్ల అధిక్యంలో వైసీపీ అభ్యర్థి.

ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ 9.140 ఓట్ల అధిక్యం.

ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి 3 రౌండ్ పూర్తి అయ్యేసరికి 3,661 ఓట్ల అధిక్యం.

పలాసలో టీడీపీ అభ్యర్థి శిరీష 7,199 ఓట్ల అధిక్యం.

బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం ఆరో రౌండ్ ముగిసే సమయానికి 12,905 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ.

ప్రొద్దుటూరులో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరద రాజుల రెడ్డి.

7వ రౌండ్ ముగిసే సరికి 6287ఓట్ల ఆధిక్యంలో వరద రాజుల రెడ్డి.

కడపలో 7వ రౌండ్ ముగిసే సరికి 6,448ఓట్ల ఆధిక్యతలో టీడీపీ అభ్యర్ధి మాధవి రెడ్డి..

సత్తెనపల్లి నియోజకవర్గం 6రౌండ్లు పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 13,119 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కడప జిల్లా జమ్మలమడుగులో 8వ రౌండ్ ముగిసే సరికి 6,814 ఓట్ల ఆధిక్యంలో బిజెపి..

నంద్యాలలో కూటమి అభ్యర్థి ఎన్ఎండి ఫారూఖ్ 10వేల ఓట్ల ఆధిక్యతలో వున్నారు.

బాపట్ల 8 రౌండ్ ముగిసేసరికి 20,467 ఓట్ల ఆదిక్యంతో తెలుగుదేశం అభ్యర్థి నరేంద్ర వర్మ.

11000వేలకు పైగా మెజారిటీతో దూసుకుపోతున్న పల్నాడు జిల్లా.. గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు.

అవనిగడ్డ నియోజకవర్గంలో 6రౌండు ముగిసేసరికి జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ 13,711 ఓట్ల ఆధిక్యం.

సత్తెనపల్లి నియోజకవర్గం 7రౌండ్లు పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 14,983 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం 5రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు 8,469 కోట్ల అధిక్యం..
అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గం 8రౌండ్ల పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ 7,734 ఓట్ల అధిక్యం.

రాప్తాడు నియోజకవర్గం 8వ రౌండ్లలో లెక్కింపు పూర్తి. పరిటాల సునీత 7,694 ఓట్ల అధిక్యం.
ఉరవకొండ నియోజకవర్గం 8రౌండ్ల లెక్కింపు పూర్తి. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ 7,588 ఓట్ల అధిక్యం.

కడప జిల్లా..

మైదుకూరు లో 7 వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ 11765 ఓట్ల అధిక్యo…

కడప లో 3992 ఓట్ల తో టీడీపీ అధిక్యం..

కమలాపురం లో 5 రౌండ్లు పూర్తయ్యే సరికి 6673 ఓట్ల అధిక్యం లో టీడీపీ…

జమ్మలమడుగు లో 5 రౌండ్లు పూర్తయ్యే సరికి 1908 ఓట్ల అధిక్యం లో బిజెపి…

ప్రొద్దుటూరు లో 8 రౌండ్లు ముగిసే సరికి 10200 ఓట్ల అధిక్యం లో టీడీపీ.



Advertisement

తాజా వార్తలు

Advertisement