Saturday, September 14, 2024

AP – సీతారామపురం హత్య కేసులో నిందితులు అరెస్టు…

నంద్యాల బ్యూరో ప్రభ న్యూస్ – ఈ నెల మూడో తేదిన సీతారాంపురంలో జ‌రిగిన ప‌సుపులేటి సుబ్బ‌రాయుడు హ‌త్య కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. నంద్యాల- చాపిరేవుల రోడ్ లో చాపిరేవుల అండర్ పాస్ దగ్గర టిడిపికి చెందిన బుడ్డారెడ్డి శ్రీనివాస రెడ్డి వ‌ర్గానికి చెందిన 11 మందిని ప‌ట్టుకున్నారు.. వారి నుంచి హ‌త్య‌కు వినియోగించిన క‌త్తులు , క‌ర్ర‌లు, ఇనుప రాడ్ల‌ను సీజ్ చేశారు. అలాగే రెండు కార్ల‌ను కూడా స్వాదీన ప‌రుచుకున్నారు.

అరెస్ట్ చేసిన వారిలో బుడ్డా రెడ్డి ప్రభాకర్ రెడ్డీ (ఏ2) వంగాల లక్ష్మి రెడ్డి (ఏ3) వంగాల పుల్లారెడ్డి (ఏ4). బుడ్డా రెడ్డి గారి లక్ష్మి నాగశేఖర్ రెడ్డి అలియాస్ కుంటి శేఖర్ రెడ్డి (ఏ5). తాలూరి శ్రీనివాసులు అలియాస్ దుబ్బ శ్రీను (ఏ7)పెరుమాళ్ల వెంకటరమణ అలియాస్ డీలర్ రమణ ఏ9,మైలాపురం రామచంద్ర రెడ్డి, (ఏ10) దూదేకుల బాల హుసేని, (ఏ11)జిల్లెల్ల బాస్కర్. (ఏ12)గని రంగస్వామి. (ఏ13)వంగాల ఈశ్వర్ రెడ్డి (ఏ 14) ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌ధాన నిందితుడితో పాటు మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement