Friday, October 4, 2024

TENSION : పుంగనూరులో మరో అలజడి.. ఇండోర్ షటిల్ స్టేడియం భవనం కూల్చివేత

రాత్రికి రాత్రే ఈ భవనం ధ్వంసం
గుర్తుతెలియని దుండగుల చర్య
పోలీసులకు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఫిర్యాదు

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని గుర్తుతెలియని దుండగులు కూల్చివేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలోనే ఈ ఘటన చోటు చేసుకోవటంతో.. చిత్తూరు జిల్లాలో కలకలం రేగింది. సుమారు రూ. 60 లక్షలతో ఈ ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే యంత్రాలతో కూల్చేశారు.

ఆదివారం ఉదయం చూసే సరికి శిథిలాలు కనిపించటంతో.. క్రీడాకారులు భయాందోళనకు గురయ్యారు. 2013 లో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ సభ్యులు, స్థానికుల విరాళాలతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టు భవనం నేలమట్టం కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement