Saturday, October 5, 2024

Andhra Pradesh – రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఆరుగురి దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల రోడ్లు రక్తమోడాయి. శనివారం వెలుగుచూసిన ఈ ప్రమాదాలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని కొండవాండ్లపల్లి వద్ద ఓ కారుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉండగా.. తీవ్ర గాయాలపాలైన మరొకరి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా మృతదేహాలను సమీపంలోని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

- Advertisement -

టూరిస్టు బస్సు బోల్తా ..

ఇక చిత్తూరు జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడింది. బస్సు అనంతపురం నుంచి తమిళనాడుకు వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో 10 మంది టూరిస్టులు గాయపడ్డారు. చనిపోయినవారు సత్యసాయి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement