Wednesday, September 18, 2024

Andhra Pradesh – సీనియర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌కు ఝ‌ల‌క్‌

వెయిటింగ్‌లో ఉన్న‌వారికి షాకిచ్చిన డీజీపీ
అటెండెన్స్ ఉండాల్సిందే
ఉద‌యం 10 గంటల నుంచి ఆఫీసులో ఉండాల్సిందే
16 మంది ఐపీఎస్‌ల‌కు మెమోలు జారీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ : వెయిటింగ్‍లో ఉంటూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని ఐపీఎస్‍ అధికారుల‌కు ఏపీ డీజీపీ ద్వారకా తిరుల‌మ‌రావు మెమో ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని బుధ‌వారం ఆదేశాలు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని పేర్కొన్నారు. మొత్తం 16మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశాలు అందాయి. ఇక‌.. వెయిటింగ్‍లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌ల‌లో పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, క్రాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు వంటి వారున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement