Monday, September 16, 2024

Andhra Pradesh శాంతి చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు ముడి .. మీ భర్త ఎవరో చెప్పాలంటూ నోటీస్

అంధ్ర్ర్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – వివాద‌స్ప‌ద దేవాదాయ శాఖ అసిస్టేంట్ క‌మిష‌న‌ర్ శాంతికి ఆ శాఖ మ‌రో షాక్ ఇచ్చింది.. అస‌లు మీ భ‌ర్త ఎవ‌రంటూ ప్ర‌శ్నించారు.. ఈ మేర‌కు ఆరు ఆంశాల‌త‌తో ఆమెకు నోటీస్ జారీ చేశారు.. ఆ నోటీస్ లో దేవాదాయశాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె.మదన్ మోహన్ అని పేర్కొన్నారు. సర్వీస్ రిజిస్టర్ లో అదే నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్ లో ఉన్న సహాయ కమిషనర్ కె.శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ తాఖీదు జారీ చేశారు.

ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆమెపై కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్ చేసి తొమ్మిది అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్ గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆరు అభియోగాలు మోపారు.

- Advertisement -

కొత్త అభియోగాలు ఇవి..

విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి,.
వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై ఓ అభియోగం నమోదు చేయగా…
దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం మోపారు.
కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియోగం నమోదు చేశారు.
ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్.. మీరు పార్టీకి వెన్నెముక అని … ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు.
విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్మెంట్లోని మరో ప్లాట్ లో నివాసితులతో గొడవపడగా, 2022 ఆగస్టులో అరిలోవ పోలీస్టేషన్ లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు.
శాంతికి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో అనకాపల్లిలో సిద్ధేశ్వరస్వామి ఆలయం,
చోడవరంలో విఘ్నేశ్వర ఆలయం, హార్డేంజ్ రెస్ట్ హౌస్, లంకెలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయం, ధారపాలెం ధారమల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా కమిషనరు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ అభియోగం మోపారు . వీటన్నింటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు
ఇది ఇలా ఉంటే శాంతి సహాయ కమిషనర్ గా పని చేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంకా ఏయే ఉల్లంఘనలకు పాల్పడ్డారు . భూములు, దుకాణాల లీజులలో ఏం చేశారు. ఆలయాల భూములు పరాయిపరం చేసేలా ఎన్వోసీల జారీకి సిఫార్సులు చేశారా అనేవి పరిశీలించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement