Thursday, September 12, 2024

Andhra Pradesh – జిల్లాల‌లో 15న జెండావిష్క‌ర‌ణ‌లు చేసే మంత్రులు వీరే…

అమరావతి: రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వాతంత్ర్య వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రొటోకాల్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాస్థాయిలో నిర్వహించే వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలిపింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఉదయం 9 గంటలకు సీఎం ఆవిష్కరిస్తారని, జిల్లా స్థాయిలో మంత్రులు పతాకావిష్కరణ చేస్తారని తెలిపింది. ఈ మేరకు వేడుకల్లో పాల్గొనే మంత్రులు వివరాలను వెల్లడించింది. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ జాతీయ జెండాను ఎగురవేస్తారని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపింది.

జిల్లాల్లో పాల్గొనే మంత్రుల వివరాలు..
శ్రీకాకుళం- అచ్చెన్నాయుడు
విజయనగరం- కొండపల్లి శ్రీనివాస్‌
పార్వతీపురం మన్యం- గుమ్మిడి సంధ్యారాణి
విశాఖపట్నం- అనగాని సత్యప్రసాద్‌
అనకాపల్లి- వంగలపూడి అనిత
తూర్పుగోదావరి- కందుల దుర్గేశ్‌
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- వాసంశెట్టి సుభాష్‌
పశ్చిమగోదావరి- నిమ్మల రామానాయుడు
ఏలూరు- కొలుసు పార్థసారథి
కృష్ణా- కొల్లు రవీంద్ర
గుంటూరు- నారా లోకేశ్‌
పల్నాడు- నాదెండ్ల మనోహర్‌
బాపట్ల- గొట్టిపాటి రవికుమార్‌
ప్రకాశం- డోలా బాలవీరాంజనేయస్వామి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు- పి. నారాయణ
చిత్తూరు- సత్యకుమార్‌
కడప- ఎన్‌ఎండీ ఫరూక్‌
అన్నమయ్య- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
తిరుపతి- ఆనం రామనారాయణరెడ్డి
నంద్యాల- బీసీ జనార్దన్‌రెడ్డి
కర్నూలు- టీజీ భరత్‌
అనంతపురం- పయ్యావుల కేశవ్‌
శ్రీ సత్యసాయి- సవిత

Advertisement

తాజా వార్తలు

Advertisement