Saturday, September 14, 2024

Andhra Pradesh – నేడు గ‌వ‌ర్న‌ర్ తో జ‌గ‌న్ భేటి..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – తాడేపల్లి. – ఎపి గ‌వ‌ర్న‌ర్ అబ్డుల్ న‌జీర్ తో మాజీ సిఎం, వైసిపి అధినేత జ‌గ‌న్ నేడు భేటి కానున్నారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న‌కు సాయంత్రం 5 గం.కు అపాయింట్మెంట్ ఇచ్చారు.. రాజ్‌భవన్‌ వెళ్లి, గవర్నర్ క‌ల‌సి రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను జగన్ వివరించనున్నారు.

వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను జగన్ గవర్నర్ కు స‌మ‌ర్పించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement