Wednesday, July 3, 2024

Andhra Pradeshలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

ఏడో తేది వ‌ర‌కూ రిజిస్ట్రేష‌న్స్
నాలుగో తేది నుంచి స‌ర్టిఫికెట్స్ ప‌రిశీల‌న
19వ తేది నుంచి క్లాసులు ప్రారంభం

అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. 13న ఆప్షన్ల మార్పు, 16న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 17-22లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఇటీవల కన్వీనర్‌ నవ్య ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement