Thursday, September 19, 2024

Andhra Pradesh – 18న ఎపి కేబినెట్ బేటి…

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గ సమావేశం ఈనెల 18న జరుగనుంది . ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలని జీఏడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రంలోగా అన్ని వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అలాగే స‌మావేశ వివ‌రాల‌ను కేబినెట్ మంత్రులంద‌రికీ అధికారులు పంపారు.. 18న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో జ‌ర‌గ‌నున్న ఈ భేటిలో ఇటీవల ఏపీలో సంభ‌వించిన వరదలు, భారీ వర్షాలకు జరిగిన నష్టంపై చర్చ, బాధితులకు పరిహారంతో పాటు మరికొన్ని పథకాలపై సుదీర్ఘంగా చర్చించినిర్ణయం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement