Monday, June 24, 2024

Andhar Pradesh – డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఏపీని అగ్రగామిగా నిలుపుతాం – మంత్రి స‌త్య‌కుమార్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముందే దీపావళి వచ్చింద‌ని.. ఐదేళ్ల రాక్షస పాలనకు స్వస్తి పలికి.. ప్రజలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి చారిత్రాత్మిక విజయం అందించారని తెలిపారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.. మంత్రి హోదాలో ఆయ‌న తొలిసారి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరానికి వ‌చ్చిన ఆయ‌న‌కు కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు.. భారీ ఎత్తున తరలివచ్చి నియోజవర్గ పరిధిలోకి విచ్చేసిన సత్య కుమార్ యాదవ్ కి అడుగడుగునా నీరాజనాలు పడుతూ పూలమాలలతో సత్కరించుకుంటూ రోడ్డు పొడవునా స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం తిరుగోమనంలో పయనించి.. 20 ఏళ్లు వెనక్కు వెళ్లింది.. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, సహజ వనరులు దోచుకున్నారని ఆరోపించారు.. గత పాలకులు ఏపీకి అస్తిత్వం లేకుండా చేశారు.. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతామన్నారు.. చాలా పెద్ద బాధ్యతలు ప్రజలు త‌మ‌ పై ఉంచార‌న్నారు.. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఏపీని అగ్రగామిలో ఉంచుతామ‌ని అన్నారు .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement