Tuesday, September 17, 2024

హిందూపురంలో దారుణ హత్య

హిందూపురం రూరల్ – హిందూపురం రూరల్ మండలంలోని బసవనపల్లి గ్రామ సమీపం ఆజాద్ నగర్ కు చెందిన మసురుల్లా దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హిందూపురం మండలం కె బసవన్నపల్లి వద్ద లారీ అసోసియేషన్ పెట్రోల్ బంకు సమీపంలో హిందూపురం పట్టణంలోని ఆజాద్ నగర్ కు చెందిన మసురుల్లా(25) దారుణ హత్యకు గురయ్యాడు .హతుడి గొంతుపై శరీర భాగాలు కొడవలితో దారుణంగా నరికిన గుర్తులు ఉన్నాయి . మృతుడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు టూ టౌన్ సిఐ మన్సురుదిన్ వెల్లడించారు. హతమార్చిన స్థలం వద్ద ఇయర్ ఫోన్ లు దొరికాయి. హిందూపురం వన్ టౌన్ బాల మద్దిలేటి, టూ టౌన్ సి ఐ లు మన్సూర్ దీన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement