Friday, October 18, 2024

AP: ఐఏఎస్ ల బంగ్లాలో దొంగలు పడ్డారు..

ఇంటి దొంగలపైనే అనుమానం
ఇద్దరు ఉద్యోగుల పాత్రపై సందేహాలు
అనంతపురం, ఆగస్టు 7 ( ప్రభ న్యూస్ బ్యూరో ) : అనంతపురం జెడ్పీ పూర్వపు సీఈఓ వైఖోమ్ నిదియా దేవి, కార్పొరేషన్ కమిషనర్ మేఘ స్వరూప్ (ఇద్దరూ ఐఏఎస్ లే) బంగ్లాలో దొంగలుపడ్డారు. నగరపాలక నుంచి ఖర్చు చేసి కొనుగోలు చేసిన రూ. లక్షలు విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఇద్దరు అధికారులు ఈ మధ్యనే మేఘ స్వరూప్ మదనపల్లి సబ్ కలెక్టర్ గా, నిధియా దేవి రాజంపేట సబ్ కలెక్టర్ గా బదిలీపై వెళ్లారు. వారు ఇంట్లో లేని సమయంలో వస్తువులు చోరీకి గురయ్యాయి.

దీనికి ముఖ్య కారకులుగా ఇంటి దొంగలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయని తెలిసింది. మరి ఈ ఇంటి దొంగలను మున్సిపల్ ఆర్డీ, ప్రస్తుత ఇంచార్జ్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఎలా గుర్తిస్తారో… ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. ఏయే వస్తువులు అపహరణకు గురయ్యాయో గుర్తించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement