Thursday, September 12, 2024

AP: భార్య ఆత్మహత్య కేసులో.. భర్త అరెస్టు..

ధర్మవరం : ధర్మవరం గాంధీనగర్ కు చెందిన భువనేశ్వరి ఆత్మహత్య కేసులో భర్త గూండా విశ్వనాథ్ ను గురువారం ధర్మవరం 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 18వ తేదీన‌ భువనేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

భర్త విశ్వనాథ్, అత్త అలివేలమ్మ వేధింపులతో తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని భువనేశ్వరి తల్లి లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశ్వనాథ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement