Friday, October 18, 2024

AP | మద్యం దుకాణం లాటరీ విజేత కిడ్నాప్…

శ్రీ సత్యసాయి బ్యూరో (ఆంధ్రప్రభ) : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం ఎగ్గిలి శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆర్ రంగనాథ్ అనే వ్యక్తిని కొందరు (టిడిపి వర్గం) సోమవారం కిడ్నాప్ చేసినట్లు బాధితుని భార్య అశ్విని పుట్టపర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం పుట్టపర్తి పట్టణంలో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించి లాటరీలో లేపాక్షి మద్యం దుకాణం నంబర్ 57 కు గాను ఆర్ రంగనాథ్ అనే వ్యక్తికి లాటరీ తగిలింది. విషయం తెలిసిన వెంటనే మింగేష్ మరికొంతమంది తన భర్త రంగనాథను బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు.

తమ వద్ద మద్యం షాపుకు డబ్బులు కట్టేందుకు లేవని చెబుతూ, మీకెందుకు మద్యం షాపు అంటూ తూలనాడుతూ నా భర్త రంగనాథ్ ను అక్రమంగా కిడ్నాప్ చేశారని, బాధితుడు భార్య అశ్విని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి తమ వద్ద డబ్బులు ఉన్నాయని, లాటరీ తగలగానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు.

తమకు న్యాయం చేయాలంటూ ఆమె తన బంధువులతో కలిసి లాటరీ నిర్వహిస్తున్న సాయి ఆరామం వద్ద ధర్నా నిర్వహించారు. ఇదిఇలా ఉండగా రంగనాథ్ ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు బేరాలు సాగిస్తూ పది లక్షల నుంచి 15 లక్షలు నగదును మీకు ఇస్తాము, మద్యం దుకాణం వదిలేయాలని, మాకు అప్పజెప్పాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement