Friday, September 13, 2024

Anakapalli – అచ్యుతాపురం సెజ్ లో బాయిల‌ర్ బ్లాస్ట్ …. నలుగురి దుర్మరణం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. సెజ్‌ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్‌ పేలి నలుగురు మరణించగా, 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement