Saturday, October 5, 2024

Breaking: సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం… పదిమందికి తీవ్రగాయాలు

(ప్రభ న్యూస్, జగ్గయ్యపేట) : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బుదవాడ గ్రామ సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది.

సేకరించిన వివరాల ప్రకారం… ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదిమందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన కార్మికులను, గ్రామస్తులు ఇతర కార్మికులు వైద్యం కోసం జగ్గయ్యపేట, విజయవాడ తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement