Sunday, September 8, 2024

Amaravati Farmers: తిరుపతి సభపై హైకోర్టులో పిటిషన్

అమరావతి రైతుల చేపట్టిన పాదయాత్ర 43వ రోజుకు చేరుకుంది. ఈ రోజు రేణిగుంట నుంచి తిరుపతి వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర పూర్తి అయిన తర్వాత ఈ నెల 17న అమరావతి రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించనున్నారు.

సభకు అనుమతి ఇప్పించాలని కోరుతూ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తున్నట్టు అమరావతి పరిరక్షణ సమితి నేత శివారెడ్డి తెలిపారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. అమరావతి ఆవశ్యకతను తెలిపేందుకు కుల, మత, ప్రాంతాల బేధం లేకుండా సభకు అందరినీ ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. రాజధానితో అభివృద్ధి ఎలా సాధ్యమో సభలో వివరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement