Saturday, September 7, 2024

Amaravati రైతుల మొక్కుబడి – కాలినడకన దుర్గమ్మ చెంతకు

ఆంధ్రప్రభ బ్యూరో, ఎన్జీఆర్ జిల్లా : తమ చిరకాల కోరిక నెరవేరాలంటే.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలినడకన బెజవాడ కనక దుర్గమ్మకు మొక్కులను తీర్చుకుంటామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన అమరావతి రైతులు ,, ఆదివారం రాజధాని రైతులు కాలినడకన విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.

తలపై తీసుకొచ్చిన చక్కరి పొంగళ్లతో ఇంద్రకీలాద్రి అమ్మవారి మొక్కులను చెల్లించుకున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుపై దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అభిప్రాయ పడ్డారు.

మా కోరిక నెరవేరింది..

- Advertisement -

‘‘గత ప్రభుత్వ అధికారంలో ఉండగా దుర్గమ్మ మొక్కులు తీర్చుకునేందుకు రానివ్వలేదు. అమ్మవారిని మొక్కుదామని వస్తే అవాంతరాలు కలిగించారు. మహిళలని చూడకుండా రక్తాన్ని చిందించారు. మా ఉసురు తగిలి జగన్ మోహన్ రెడ్డి నామరూపాలు లేకుండా పోయారు. అందుకే భారీ తేడాతో ఓడిపోయాడు. ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉండాలని అమ్మవారిని వేడుకున్నాం. రాష్ట్రంలో వైసీపీ గల్లంతు కావాలని అమ్మవారిని కోరాం. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలనే మా కోరికను అమ్మవారు నెరవేర్చారు. అందుకే అమ్మవారికి మొక్కుబడులను చెల్లించుకున్నాం’’ అని రాజధాని రైతులు స్పష్టం చేశారు

.అప్పుడు దర్శనానికి వస్తే లాఠీచార్జి చేశారు..2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన రైతులపై అప్పటి ప్రభుత్వం లాఠీఛార్జి ప్రయోగించింది. అప్పుడు మొక్కు చెల్లింపు పూర్తి కాకపోవడంతో నేడు చెల్లించేందుకు కాలినడకన అమరావతి రైతులు బయలుదేరారు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు చేరుకున్నారు. పెద్దఎత్తున్న డప్పులు, మేళాలతో అమరావతి రైతులు విజయవాడకి చేరుకుని దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement