Tuesday, October 22, 2024

Drone Summit: ప్రారంభమైన అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌-2024’ ప్రారంభమైంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ వేదికగా ప్రారంభమైన ఈ వేడుకను సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా ప్రారంభించారు. జాతీయ స్థాయిలో 2 రోజులపాటు ఈ సమ్మిట్ జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ రెండు రోజుల్లో 9 ప్యానల్‌ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్‌ పాలసీ పత్రం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. డ్రోన్ల వినియోగంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే టాప్‌గా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు తొలి అడుగు కావాలని సీఎం ఆకాక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement