Saturday, September 14, 2024

Amaravathi – నేడు సిఆర్డీఎ అధికారుల‌తో చంద్ర‌బాబు సమావేశం..

అమ‌రావ‌తి – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమ‌క్షంలో ఈ రోజు సీఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది.. రాజధాని నిర్మాణాల పునః ప్రారంభంపై కీలక చర్చ సాగనుంది.. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.. డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు మంత్రి నారాయణ. మరోవైపు.. ఇటీవలే రాజధానిలో ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు.. రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది ప్రపంచ బ్యాంక్, ఏడీబీ. అయితే, రాజధాని అమరావతిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై ఈ రోజు చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది.. కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు భూములు కేటాయించే అంశంపైనా చర్చించే అవకాశం ఉందంటున్నారు..

కాగా, గత ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని పక్కన బెట్టిన నేపథ్యంలో.. తమ హయంలో జరిగిన పనులు ఎక్కడ నిలిచిపోయాయి.. అవి పటిష్టంగా ఉన్నాయా? అనే అంశాలపై కూడా ప్రభుత్వం ఆరా తీసిన విషయం విదితమే.. రాజధాని ప్రాంతంలో పర్యటించిన నిపుణుల కమిటీ.. నిర్మాణాల స్థితి, పటిష్ఠతపై ప్రభుత్వానికి నివేదికలు అందజేసిన నేపథ్యంలో తిరిగి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది చంద్రబాబు సర్కార్..

Advertisement

తాజా వార్తలు

Advertisement