Sunday, September 29, 2024

Amaravathi – తిరుమ‌ల‌కు అమ‌రావతి రైతుల కృత‌జ్ఞ‌త యాత్ర‌..

అమరావతి: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తిరుమలకు నేడు మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు. అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మొదలుపెట్టిన పాదయాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ప్రారంభించారు. 20 రోజుల పాటు ఇది కొనసాగనుంది. కాగా ,నిన్న అమ‌రావ‌తి రైతులు క‌న‌క‌దుర్గ అమ్మ‌వారికి పొంగ‌ళ్లు స‌మ‌ర్పించి మొక్కులు తీర్చుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement