Friday, September 13, 2024

Allocations – సిఎం చంద్ర‌బాబు పేషీలోని ఐఎఎస్ ల‌కు శాఖ‌లు కేటాయింపు…

ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలోని నలుగురు అధికారులు పర్యవేక్షించాల్సిన శాఖలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు సీఎం కార్యాలయం, సాధారణ పరిపాలనశాఖ, హోమ్‌, ఆర్థిక, ఎక్సైజ్‌, రెవెన్యూ, దేవాదాయ శాఖలు కేటాయించారు.

ఏవీ రాజమౌళికి జలవనరులు, విద్యుత్‌, గనులు, వ్యవసాయం, సీఎంఆర్‌ఎఫ్‌, ఫిర్యాదులు తదితర శాఖలు పర్యవేక్షించనున్నారు. ప్రద్యుమ్నకు రవాణా, పురపాలక, పంచాయతీరాజ్‌, ఆర్టీజీఎస్‌, అటవీ, పౌరసరఫరాలశాఖలు కేటాయించారు. కార్తికేయ మిశ్రాకు ఆర్థిక, ఐటీ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, సమాచార పౌరసంబంధాలు, పరిశ్రమలు, సీఎం దిల్లీ, విదేశీ పర్యటనల సమన్వయం తదితర విభాగాలు చూడనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement