Friday, September 6, 2024

AP: కూటమి నేతల భేటీ.. హాజరైన మూడు పార్టీల ఎమ్మెల్యేలు

విజయవాడ ఏ కన్వెన్షన్ లో కూటమి నేతలు సమావేశమయ్యారు. ముందుగా నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపరిచే అవకాశం ఉంది. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్‌కు కూటమి నేతలు పంపనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పంపనున్నారు. రేపు ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement