Wednesday, October 23, 2024

Alert Devotees – 10 రోజుల పాటు అన్ని శ్రీవారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు….

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో స్వామి వారి వాహన సేవలు వీక్షించేందుకు తిరుమలకు సామాన్య భక్తులు సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని భావిస్తున్న టీటీడీ, ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగానే బ్రహ్మోత్సవాలు కు అంకురార్పణ జరిగే అక్టోబరు 3 నుండి 12 చక్రస్నానం నిర్వహించేంత వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను సైతం టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని టీటీడీ కోరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement