Wednesday, September 18, 2024

Adoni – బీజేపీ నేత దారుణ హత్య

ఆంధ్రప్రభ స్మార్ట్ – కర్నూలు బ్యూరో – కర్నూలు జిల్లా,ఆదోని మండలo,పెద్ద హరివాణం గ్రామంలో చెందిన బిజెపి నేత షేకప్ప దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.బీజేపీ నేత సేకప్పనీ గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. రాత్రి ఆయన ఇంటి బయట నిద్రించగా ఈ హత్య జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడు గతంలో వైసీపీ కాగా ఇటీవలే బీజేపీలో చేరారు.

వరుస హత్యల కలకలం
కాగా కర్నూలు జిల్లాలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఆరు హత్యలు జరిగాయి. ఇందులో నలుగురు టీడీపీకి చెందినవారు కాగా, ఒకరు వైసీపీ, మరొకరు బీజేపీకి చెందిన కావడం గమనార్హం.వెల్దుర్తి, డోన్, ఆళ్లగడ్డ, పత్తికొండ ప్రాంతాల్లో టీడీపీ నేతలు హత్యకు గురవ్వగా , మహానంది మండలంలో వైసీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు హత్యకు గురయ్యారు. తాజాగా నేటి ఉదయం ఆదోని మండలం, పెద్ద హరివనం గ్రామానికి చెందిన బీజేపీ నేతను దుండగులు గొంతు కోసి చంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement