Friday, September 13, 2024

AP | ఏయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య ఇ.ఎన్‌ ధనుంజయ రావు..

ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా జియాలజీ విభాగం ఆచార్యులు ఇ.ఎన్‌ ధనుంజయ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణ రావు నుంచి ఉత్తర్వులను స్వీకరించారు. ఏయూ రెక్టార్‌గా ఆచార్య ఎన్‌.కిషోర్‌ బాబు, అకడమిక్‌ ఎఫైర్స్‌ డీన్‌గా ఆచార్య కె.ఈశ్వర్‌ కుమార్‌, ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ డీన్‌గా ఆచార్య చల్లా రామకృష్ణ, సీడీసీ డీన్‌గా ఆచార్య టి.వి కృష్ణ, స్టూడెంట్‌ ఎఫైర్స్‌ ఇంచార్జి డీన్‌గా డాక్టర్‌ జి.రాంబాబు, ఏఇఆర్‌సి గౌరవ డైరెక్టర్‌గా డాక్టర్‌ బి.లిల్లీ గ్రేస్‌, కంప్యూటర్‌ సెంటర్‌ అసోసియేట్‌ డీన్‌గా డాక్టర్‌ కె.వెంకట రమణ, స్టూడెంట్‌ ఎఫైర్స్‌ అసోసియేట్‌ డీన్‌లుగా డాక్టర్‌ ఎన్‌.ఎం యుగంధర్‌, డాక్టర్‌ ఎస్‌.హరనాథ్‌,గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా డి.రామారావు, ఐఏఎస్‌ఈ ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ డి.నాగరాజ కుమారిలు నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement