Saturday, October 26, 2024

Accident – లారీ – కంటైనర్ ఢీ … మంటల్లో డ్రైవర్ సజీవదహనం

  • పెళ్లకూరులో ఘోర రోడ్డు ప్రమాదం
  • ముందు వెళుతున్న లారీని ఢీకొన్న కంటైనర్ లారీ
  • లారీలో చెలరేగిన మంటలు
  • కంటైనర్ డ్రైవర్ మంటల్లో సజీవదహనం
  • సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

పెళ్లకూరు(ఆంధ్రప్రభ): తిరుపతి జిల్లా పెళ్లకూరు ‌మండలం టెంకాయతోపు సమీపంలోని నాయుడుపేట – రేణిగుంట 71వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని హోసూర్ నుంచి కలకత్తాకు వెళ్తున్న కొరియర్ కంటైనర్ పెళ్లకూరు మండలం టెంకాయతోపు వద్దకు వచ్చేసరికి పూతలపట్టు నుంచి రాజమండ్రికి కూల్ డ్రింక్స్ బాటిళ్లతో వెళ్తున్న లారీని వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కొరియర్ కంటైనర్ లో మంటల చెలరేగడంతో ఆ కంటైనర్ డ్రైవర్ ఫిరోజ్ సజీవదహనమయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement