Saturday, October 19, 2024

Accident : పొట్టకూటి కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..

ఆటోను ఢీకొన్న లారీ ఒకరు మృతి… 14 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
పులివెందుల అర్బన్, ఆగస్టు 2 (ప్రభ న్యూస్) : పొట్టకూటి కోసం వెళ్తున్న కూలీలను మృత్యువు కంబళించింది ఆటోను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళా కూలీ మృతిచెందగా 14మందికి గాయాలయ్యాయి. మ‌రో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన కడప జిల్లా పులివెందులలో చోటుచేసుకుంది.

సత్యసాయి జిల్లా బట్రేపల్లె గ్రామానికి చెందిన మహిళలు కూలీ పని నిమిత్తం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి 17మంది కూలీలు ఆటోలో వెళ్తుండ‌గా మార్గ మధ్యంలోని పులివెందుల సమీపంలోని డంపింగ్ యార్డ్ సమీపంలో కదిరి నుంచి పులివెందుల వైపు అతివేగంతో వస్తున్న లారీ ఆటోను వెనుకవైపు ఢీకొట్టడంతో ఆటో పక్కనే ఉన్న తోటలో బోల్తా పడింది.

ఈ ఘటనలో ఒక బుక్కే నాగమ్మ (71) అనే మహిళ కూలీ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా 16మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలకు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో అటుగా వెళుతున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement