Friday, September 13, 2024

Accident – తిరుమ‌ల రెండో ఘాట్‌లో బైక్ – బస్సు ఢీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, తిరుప‌తి : తిరుమ‌ల రెండో ఘాట్ రోడ్డులో ఈ రోజు ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.
ఈ ప్ర‌మాదంలో ద్విచ‌క్ర వాహ‌నంపై ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. త‌మిళ‌నాడు తిరువ‌ల్లూరుకు చెందిన కార్తీక్‌, మ‌రో మ‌హిళ క‌ల‌సి తిరుమ‌ల‌కు వెళుతున్నారు. మ‌రో కొద్ది క్ష‌ణాల్లో తిరుమ‌ల‌కు చేరుకునే స‌మ‌యంలో జీఎన్సీ టోల్ గేట్‌కు స‌మీపంలో ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సు వెనుక నుంచి ఢీకొంది. బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు కింద ప‌డిపోయారు.

ప్రమాదానికి గురైన ఇద్ద‌రి పైనుంచి అదే బ‌స్సు వెళ్ల‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్‌, పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని బ‌స్సు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement