Tuesday, September 24, 2024

AP | వరద బాధితుల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రూ.కోటి విరాళం…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరపున వరద బాధితుల సహాయార్థం రూ. కోటి చెక్కును ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ సీఎం చంద్రబాబు ను కలసి అందజేశారు. మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌ బాబు, ఉపాధ్యక్షుడు పి. వెంకట రమణ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌ డి. గౌర్‌ విష్ణు తేజ్‌ లతో చిన్ని సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కును అందజేశారు.

ఏసీఏ నూతన పాలకవర్గం సభ్యులు ఇటీవల కొలువుదీరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వరద బాధితుల సహాయార్థం ఏసీఏ సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. వరద బాధిత కుటుంబాల కోసం కొనసాగుతున్న సహాయ, పునరావాస ప్రయత్నాలలో ఈ సహకారం సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా శివనాథ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement