Saturday, October 5, 2024

AP: పిడుగుపాటుకు యువకుడు మృతి…

నంద్యాల బ్యూరో, అక్టోబర్ 5 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన శివగంగాధర్ గా గుర్తించారు. ఇవాళ ఉదయం మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

వెలుగోడు మండలం రేగడగూడూరు-అలగనూరు గ్రామాల మధ్య తెలుగుగంగ వంతెనపై ఉంచిన మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబెట్టుకొని అక్కడే నిద్రిస్తున్న యువకుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. పిడుగుపడడంతో ఉలిక్కిపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెలుగోడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement