Tuesday, September 17, 2024

KNL: పొలం తగాదాలో మహిళ హత్య…

ఆదోని రూరల్ : కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని నాగనాతనహళ్లి గ్రామంలో పొలం తగాదా విషయంలో గుండమ్మ అనే మహిళ ఇవాళ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన తిరుమలమ్మకు చెందిన పొలం నాలుగు ఎకరాలు మూడు సంవత్సరాల క్రితం గుండమ్మ కొనుగోలు చేసింది.


అప్పటి నుండి ఇప్పటి వరకు హత్యకు గురైన గుండమ్మ సాగు చేసుకుంటుంది. అదే గ్రామానికి చెందిన వారు ఈ పొలం తమదే అంటూ గుండమ్మ తమ పొలానికి వెళ్లడంతో గుండమ్మను ట్రాక్టర్ తో గుద్ది చంపారు. పొలం తగాదాలో హత్యకు గురైన గుండమ్మ తో పాటు పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతిచెందిన గుండమ్మను, గాయాలపాలైన పురుషోత్తం రెడ్డిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement