Saturday, September 7, 2024

AP: కుప్పంలో నారా భువనేశ్వరికి.. గజమాలతో ఘన స్వాగతం

కుప్పం, జులై 23(ప్రభ న్యూస్) : కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి విచ్చేసిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వెంకటాపురం గ్రామస్తులు భారీ గజమాలతో నారా భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలు పసుపు చీరలు కట్టుకుని ఆమెకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డుమార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించినప్పటి నుండి భువనేశ్వరికి అడుగడుగునా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా శోలిశెట్టిపల్లి, 64-పెద్దూరు, గసికపల్లి గ్రామాల్లోని ప్రజలు ఘన స్వాగతం తెలిపారు. అక్కడ నుండి పెద్దూరులో మహిళలు, పాఠశాల విద్యార్థులు నారా భువనేశ్వ‌రికి హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను ప్రేమగా దగ్గరకు తీసుకుని విద్యార్థులతో కాసేపు ముచ్చటించి బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆమె సూచించారు. అలాగే విద్యార్థులకు చాక్లెట్లు అందించి, వారితో సరదాగా ఫోటోలు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement