Tuesday, October 22, 2024

AP | చెరువులో శవమై తేలిన మిస్సింగ్ యువ‌కుడు…

విశాఖ కంచరపాలెంకు చెందిన చంద్రకాంత్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో యువకుడి తండ్రి కోటేశ్వరరావు విశాఖ, అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు బొందుగూడ గ్రామ సమీపంలోని చెరువులో యువకుడు చంద్రకాంత్ అరకు శవమై తేలినట్లు సమాచారం అందింది.

దీంతో సీఐ సీహెచ్‌ రుద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికిశారు. యువ‌కుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో లభ్యమైన మృతదేహం చంద్రకాంత్‌గా యువకుడి తండ్రి కోటేశ్వరరావు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement