Thursday, September 19, 2024

AP: విధినిర్వ‌హ‌ణ‌లో ఉన్న‌ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ముఖ్యమంత్రి బందోబస్తు విధుల కోసం వచ్చిన ఒక కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. సీఎం ఎస్కార్ట్ వాహనంలో విధులు నిర్వహించడానికి వచ్చిన ఒక ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కోసం వస్తున్న సీఎం చంద్రబాబు విధి నిర్వహణ కోసం వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ (పీసీ 3570) గుండెపోటుతో మరణించాడు.

విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విధినిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో తక్షణమే స్పందించిన తోటి సిబ్బంది ఆంధ్ర హాస్పిటల్ కు వైద్య చికిత్స కోసం తరలించారు. సీఆర్పీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో అప్పటికే మృతిచెందినట్లుగా ఆంధ్ర హాస్పటల్ వైద్యులు ధ్రువీకరించారు. సీఎం కాన్వాయ్ ఎస్కార్ట్ వాహనంలో డ్యూటీ నిమిత్తం వచ్చి, తమ సహచరుడు మృతి చెందడం బాధాకరంగా ఉందని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement