Tuesday, September 17, 2024

AP: ఎగ్జిట్ పోల్స్ ను మించి కూట‌మికి ఘ‌న విజ‌యం… గంటా శ్రీనివాస్

విశాఖ : ఎగ్జిట్ పోల్స్ ను మించి కూట‌మికి ఘ‌న విజ‌యం వ‌స్తుంద‌ని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. కనక మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అనంత‌రం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం రేపు రాబోతుందన్నారు. 5ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షo లభించబోతోంద‌న్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయం అని చెప్పాయన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై కసి పెరిగిందన్నారు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని తరిమెయ్యాల‌నే కసి ఓటర్లలో స్పష్టంగా కనిపించిందన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి కూడా బస్సుల్లో, ట్రైన్లలో వేలాడుతూ.. ఓట్లు వేసేందుకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అత్యధిక నమోదైన పోలింగ్ శాతం ప్రజల నాడీకి సంకేతమ‌న్నారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పునర్వైభవం వ‌స్తుంద‌న్నారు. విశాఖలో 7 అసెంబ్లీ పార్లమెంట్ క్లీన్ స్వీప్ చేస్తున్నామ‌న్నారు. అల్లర్లు సృష్టించే వాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావన్నారు. భీమిలిలో, రాష్ట్రంలో కూడా తెలుగుదేశందే గెలుపు అని గంటా శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement