Monday, October 7, 2024

AP | ఇంటర్‌లో 75 శాతం హాజరు తప్పనిసరి..

అమరావతి, ఆంధ్రప్రభ:2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు రాసేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృతిక శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ చదివే జనరల్‌, ఒకేషన్‌ విద్యార్ధులు పరీక్షలు రాయడానికి అర్హత సాధించేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి కాండినేషన్‌ ద్వారా అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కళాశాలల ప్రిన్సిపల్‌ విద్యార్ధుల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement