Sunday, September 8, 2024

AP : తవుడు బస్తాల మధ్య 7కోట్ల న‌గ‌దు…!

ఏపీలో శనివారం ఉదయం ఓ ప్రమాదం సంచలనం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు భారీగా నోట్ల కట్టలు దొరికాయి. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో టాటా ఏస్‌ వాహనాన్ని ఓ లారీ ఢీకొంది. అంతే టాటా ఏస్ వాహనం బోల్తా పడగా.. అందులో చేపల మేత తవుడు బస్తాల మధ్య 7 అట్టపెట్టెల్లో నగదు బయటపడింది.

- Advertisement -

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ దొరికిన మొత్తం నగదు సుమారు రూ.7కోట్లుగా అంచనా వేశారు. ఈ వాహనం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోల్తాపడిన టాటా ఏస్‌ వాహన డ్రైవర్‌ తీవ్రంగా గాయపడటంతో అతడిని గోపాలపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement