Friday, October 18, 2024

AP: కారులో 538 కేజీల గంజాయి స్వాధీనం..

పాడేరు, స్మార్ట్ న్యూస్ : పాడేరు మండలం చింతల వీధి జంక్షన్ లో గంజాయి కారు కలకలం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగి రోడ్డు గుంతల దిగబడటంతో ఆ కారును అక్కడే వదిలేసి.. కారులోని వ్యక్తులు పరారైన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో చోటు చేసుకుంది. ఇలా దొరికిన కారులో 583 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పాడేరు సీఐ దీనబందు తెలిపిన వివరాల ప్రకారం… చింతలవీధి నుండి పెదబయలు వైపు వెళ్తున్న క్రమంలో రహదారిలో ఒక కారు రోడ్డు ప్రక్కన దిగబడి ఉందని సమాచారం రావడంతో పాడేరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సూర్యనారాయణతో పాటు సిబ్బందిని, మధ్యవర్తులతో కలిసి చింతలవీధి జంక్షన్ పంపించడం జరిగిందన్నారు. ఆ సమయంలో ఒక కారు రోడ్డుకు ఎడమ ప్రక్కన అనుమానంగా ఆగి ఉన్నదని పాడేరు ఎస్సై కారును పరిశీలించగా.. మొత్తం 538 కేజీల గంజాయి కలిగి ఉన్నదని తెలిపారు.

ఈ కారులో ఉన్న గంజాయి విలువ సుమారు రూ.27లక్షల వరకు ఉంటుందన్నారు. గంజాయితో ఉన్న కారు పోలీసులు స్వాధీనం చేసుకొని పాడేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కారు ఎవరి పేరు మీద ఉన్నది, కారులో వచ్చిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాడేరు ఇన్ స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement