Saturday, September 21, 2024

AP | 19 నుంచి ఇంజినీరింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌ 2024 తుది, మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 19న ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్‌ గణేష్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్థులు ఈనెల 21లోగా పూర్తి చేయాలన్నారు.

ఈనెల 19 నుండి ఆగస్టు 22 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, 20 నుండి 22 వరకు 3 రోజుల పాటు ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్‌ స్పష్టం చేసారు. వెబ్‌ ఆప్షన్‌ల మార్పునకు ఈనెల 23వ తేదీ నిర్దేశించామన్నారు. 26న సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు.

సెల్స్‌ జాయినింగ్‌, కళాశాలలో రిపోర్టింగ్‌ కోసం ఆగస్టు 26 నుండి ఆగస్టు 30 వరకు ఐదు రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు ఐచ్ఛికాల ఎంపిక సందర్భంలో ఓటీపీలను ఇతరులకు ఇవ్వవద్దని, అది సమస్యలకు దారితీస్తుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్‌ కుమార్‌ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement