Friday, September 20, 2024

Gallantry Awards | 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు..

ఆంధ్ర్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క‌ రించుకొని పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది.

గ్యాలంట్రీలో 213 మెడల్స్‌, పీఎంజీలో 1 మెడల్‌, 94 మందికి పీఎస్‌ఎం మెడల్స్‌, 729 మందికి ఎంఎస్‌ఎం మెడల్స్‌ ప్రకటించింది. ఇక గ్యాలంట్రీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగు మెడల్స్‌, తెలంగాణకు 7 మెడల్స్‌ దక్కాయి. ఎంఎస్‌ఎం విభాగంలో ఏపీకి 19, తెలంగాణకు 11 మెడల్స్‌ వచ్చాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement