AP | పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య ?

  • నల్లమల్ల అడవిలో ప్లాస్టిక్ కవర్ లో శవం

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న పచ్చర్ల గ్రామం వద్ద కానిస్టేబుల్ శవం దొరకటం తీవ్ర సంచలనం కలిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన ఏపీఎస్పీ డిపార్ట్మెంట్ అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ ఫరూక్ దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.

నాలుగు రోజుల క్రితమే కానిస్టేబుల్ను చంపేసి బ్లూ కవర్లో చుట్టేసి పచ్చర్ల దగ్గర పడేసినట్ల సమాచారం. మంగళగిరి మంగళగిరి హెడ్ క్వార్టర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. సొంత ఊరు రావడానికి మూడు రోజులకు సెలవు తీసుకున్న కానిస్టేబుల్. సెలవుల‌ తర్వాత విధులకు హాజరు కాకపోవడంతో పోలీసు శాఖ విచారించింది.

ఇంటి దగ్గరికి రాకపోవటము డ్యూటీలో లేకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో నంద్యాల జిల్లా పచ్చర్ల సమీపంలో గల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లో కట్టిన శవము దొరికింది. ఎక్కడో చంపివేసి ప్లాస్టిక్ కవర్లో తీసుకువచ్చి పచ్చర్ల గ్రామంలోని లోయ దగ్గర పడవేశారు అని అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేయడం విశేషం.

ఈ శవం కానిస్టేబుల్ ఫరూక్ ది కావడం విశేషం.హత్యకు గల కారణం వివాహేతర సంబంధాల లేక మరి ఏమైనా ఇతర కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *