AP | మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన చంద్రబాబు

వెలగపూడి : ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు స్థానాలను భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరికొన్ని పదవులను భర్తీ చేసింది..

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు (తెదేపా) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏలూరు జిల్లా డీసీసీబీ (డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌) ఛైర్మన్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా కామేపల్లి సీతారామయ్య (తెదేపా), కాకినాడ జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా తుమ్మల రామస్వామి(బాబు)(జనసేన) నియమితులయ్యారు.

మరోవైపు ఏలూరు జిల్లా డీసీఎంఎస్‌ (డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ) ఛైర్మన్‌గా చాగంటి మురళీ కృష్ణ (చిన్నా) (జనసేన), ప్రకాశం జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా కసిరెడ్డి శ్యామల (తెదేపా), కాకినాడ జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా పి. చంద్రమౌళి (తెదేపా)ను కూటమి ప్రభుత్వం నియమించింది.

Leave a Reply