బలహీన వర్గాలకు ఉచిత శిక్షణ ఫలితం
( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ )
పోటీ పరీక్షల్లో బీసీ యువతకు ఉచిత శిక్షణ అందించినందుకు ఏపీ బీసీ సంక్షేమశాఖకు కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డు స్కోచ్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 20న ఢిల్లీలో స్కోచ్ అవార్డు ప్రదానం. బీసీ సంక్షేమశాఖకు స్కోచ్ అవార్డు రాకపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ యువతపై సీఎంకున్న శ్రద్ధకు ఈ అవార్డు నిదర్శనమని మంత్రి సవిత అన్నారు.