వెలగపూడి, ఆంధ్రప్రభ :ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రముఖ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు.
ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి ప్రభుత్వం క్రియేటివ్ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం చేసుకుందని ట్వీట్ చేశారు.
ప్రతిభావంతులైన స్థానికులకు మంచి అవశాకం.. “భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ల్యాండ్ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి క్రియేటివ్ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది. 25వేల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఎఫ్డీఐని ఆకర్షించడానికి,పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ & క్రియేట్ ఫర్ ది వరల్డ్కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.
డిజిటల్ పరిశ్రమలకు గమ్యస్థానం..
ఈ ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్షిప్ చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, లీనమయ్యే కథ చెప్పడం, ఏఐ (AI) ఆధారిత కంటెంట్కు కేంద్రంగా ఉంటుందని ఆ ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు, మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మక, డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా మారనుంది” అని సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు.