అమరావతి :తెలుగుదేశం పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. “రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధి ప్రతిబింబించాలి. ఈ నెలాఖరు లేదా జూన్ 12 లోగా అన్ని ఆలయ కమిటీలు వేస్తాం. ఆలయ కమిటీల ద్వారా 1025 మందికి పదవులు లభిస్తాయి. జూన్ 12 లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.” అని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.
AP | ఈ నెలాఖరు లోగా అన్ని నామినేటెడ్ పదువుల భర్తీ చేస్తాం: చంద్ర బాబు
